వడ్లూరు ఉన్నత పాఠశాలలో స్టడీ మెటీరియల్ పంపిణి ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గురువారం 10వ తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ శ్రీమతి రఘుమండ తేజస్వి, వైసిపి నాయకులు రఘుమండ శ్రీను స్టడీ మెటీరియల్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ మారుతీ రామ్ మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించేందుకు ప్రయోజనమని జిల్లా పరిషత్ అందించిన ఈ మెటీరియల్ ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవడం ద్వారా అత్యుత్తమ మార్కులు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి తేజస్వి మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్ ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల సహకారంతో మంచి మార్కులు సాధించాలని వడ్లూరు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పాఠశాలలో జరుగుతున్న హెల్త్ స్క్రీనింగ్ పరిశీలించి ఏఎన్ఎం రజని, వెంకటలక్ష్మి, ఎమ్మెల్ హెచ్పీ విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడం పట్ల గ్రామ సర్పంచ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రఘుమండ శ్రీను పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యత పరిసరాల శుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
