ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తణుకు మండలంలో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తణుకు మండలం మండపాక గ్రామంలో పాన్ షాప్ నిర్వాహకుడు కోప్పన దుర్గాప్రసాద్ (29) తన పాన్ షాప్ లో బహిరంగంగా మద్యాన్ని వినియోగించుటకు అనుమతించడంతో అతనిపై కేసు నమోదు చేసి అతని వద్ద లభించినటువంటి మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అనుమతులు లేకుండా మద్యం వినియోగం కోసం అనుమతించిన వ్యక్తులపై చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు.ఈ దాడులలో సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ మధుబాబు మరియు హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామి, కానిస్టేబుల్ ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
