పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ విద్యా సంస్థ శ్రీ వై.యన్.కళాశాల నందు నరసాపురంలో శనివారం శ్రీ వై.యన్.కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మరియు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో పేరుగాంచిన విద్యాసంస్థ వై.యన్.కళాశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ద్వారా ఎంతో మంది విద్యార్ధుల భవితవ్యాన్ని మార్చిన ఘనత వై.యన్.కళాశాల సొంతమని అన్నారు.
