తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో స్వామి వివేకానంద 162వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద చిత్రపటానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ యువతపై అత్యంత ప్రభావాన్ని చూపిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద అందుకే ఆయన పుట్టినరోజు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. దేన్నైనా సాధించాలంటే ఆత్మీయ విశ్వాసాన్ని ఒక వ్యక్తిలో కలిగించడం కన్నా మించిన సాయం లేదన్నారు వివేకానంద. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు, పాఠకులు బంధకవి సాయి శేఖర్, కె .వి. వి. రమణ, కె.వి.కృష్ణారావు, కె. వీర వెంకట సత్యనారాయణ, S. సాయి గిరిధర, సింహాద్రి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
