నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కె..సావరం గ్రామంలో శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవాలు మరియు భోగి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా అమావారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమినాయకులు, కార్యకర్తలు, కే.సావరం గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
