డా॥ హిప్నో కమలాకర్స్ “మైండ్ & పర్సనాలిటీ కేర్ – తణుకు” వారి ఆద్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 10 తేదీ వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు ” సందర్భంగా విద్యార్థులకు ఉచితముగా ప్రత్యేక క్లాసులు నిర్వహించబడునని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, సైకోథెరపిస్ట్ డా|| పి. రమేష్ కుమార్ తణుకులో వారి కార్యాలయంలో ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ వారం రోజులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో ఉచితముగా విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ క్లాసులు నిర్వహించబడునని తెలిపారు. విద్యార్థులలో ఉన్న మానసిక సమస్యలకు, పరీక్షలంటే భయాలు, టెన్షన్ లేకుండా ఎలా చదవాలో, పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలో, ఎలా చదివితే అత్యధిక మార్కులు సాధిస్తారో…. అనే అంశాలపై విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ఈ వారం రోజులు సాయంత్రం 4 గం|| నుండి 7 గం||ల వరకు ఆన్లైన్ (online)లో ఉచితముగా కన్సల్టేషన్ మరియు కౌన్సెలింగ్ ఇవ్వబడునని తెలియజేసారు. ప్రత్యేక క్లాసులు నిర్వహించాలన్నా, మీ సమస్యలను తెలియజేయాలన్నా అవసరం ఉన్నవారు సెల్ నెంబరు 9390044034 కి కాల్ చేసి సంప్రదించవచ్చునని తెలియజేసారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా (PPAI)” జాతీయ అధ్యక్షురాలు డా॥ హిప్నో పద్మాకమలాకర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమము జాతీయ స్థాయిలో చేయనున్నారని తెలియజేసారు. అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని PPAI సభ్యులు చేస్తున్నారని డా. పి. రమేష్ కుమార్ తెలియజేసారు.
