గీత కార్మికుల పాలసీని వెంటనే అమలు చేయాలి


ఓ మహాత్మా గీత కార్మిక పాలసీని వెంటనే ప్రకటించమని రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి అంటూ గీత కార్మికులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని బుధవారం నాడు అందజేశారు రాష్ట్ర సంఘం పిలుపును అనుసరించి బుధవారం నాడు కల్లు గీత కార్మికులు తణుకు లోని తాసిల్దార్ కార్యాలయం సమీపము గల గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి గాంధీ విగ్రహానికి పాలసీ ప్రకటించాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ లో ఒకటో తేదీన కల్లుగీత కార్మికుల పాలసీని ప్రభుత్వము ప్రకటించే దని అన్నారు. కానీ ప్రభుత్వము ఎక్సైజ్ పాలసీ కన్నా లిక్కర్ పాలసీని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. కల్లు గీత కార్మికులు ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది వృతి పై ఆధారపడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం కల్లును ఆధునీకరించి శీతల పానీయంగా గుర్తించాలని, గీత కార్మిక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలని గీత కార్మికులను గీత లేని సమయాన్ని వర్కు హాలిడే గా ప్రకటించి వడ్డీ లేని రుణాలు సొసైటీకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని , తల్లి కల్లుగీత పూర్తికి సమగ్రమైన చట్టం చేయాలని ప్రతి సొసైటీకి గతంలో ప్రభుత్వం ప్రకటించిన 500 జీవోను అమలు చేస్తూ ఐదు ఎకరాల భూమిని చెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వము భూమిని ఇవ్వాలని కల్లుగీత కార్మికులకు పెన్షన్ 45 సంవత్సరాలకే 5000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీత కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో గీత కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతారని మునుస్వామి ఉన్నారు ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు గుబ్బల వీర రాఘవులు బుర్ర సత్యనారాయణ కట్ట వెంకటేశ్వర్ రావు భాగం శ్రీరాములు పాల సత్యనారాయణ కాసాని శీను చిట్టూరి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link