కూటమి ప్రభుత్వ హామీలు అమలు చేయాలి

రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వేల్పూరు సిపిఎం శాఖా మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామంలో స్థానిక ప్రజాసంఘాల భవనంలో కర్ణాటపు నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో శాఖ కార్యదర్శి గత మూడు సంవత్సరాల కార్యకలాపాల నివేదిక ప్రవేశ పెట్టినారు. ఈ మహాసభకు హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి. ప్రతాప్ నివేదిక.సభ్యుల పని పద్ధతులపై సమీక్ష జరిపి అనంతరం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడి గ్రామంలో పార్టీ అభివృద్ధికి పలు సూచనలు చేసారు. శాఖ కార్యదర్శిగా రెండవసారి తిరునాదం వెంకటేశ్వరరావుని మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేల్పూరు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు తీర్మానాలను ఆమోదించారు. గత ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన కాలనీలో తక్షణం మౌలిక వసతులు కల్పించాలని. 2వ వార్డులో అధిక సామర్థ్యం గల విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేసి లోఓల్టేజీ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, లాకులు వద్ద ఉన్న హిందువులు, క్రైస్తవులు ఖననం చేసే స్మశాన వాటికను తక్షణం అభివృద్ధి చేయాలని, ఉచితంగా ఇసుక సరఫరా చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని శాఖ మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మహాసభలో సిపిఎం గ్రామ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు, సోరపల్లి రామకృష్ణ, కరేళ్ల అర్జున్, వాసా పోసియ్య, యండమూరి నాగేంద్ర, దున్నే రుద్ర నాగేశ్వరరావు, కుడకా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link