రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశానుసారం బుధవారం తణుకులో బాలసదన్ చిల్డ్రన్ హోం, తణుకు, 2. గుడ్ సమరిటన్ హోం, 3. స్పందన మానసిక వికలాంగుల హోం, పాలంగి, 4. ప్రభుత్వ బాలుర వసతి గృహాలను న్యాయ సేవా సంస్థ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి ఆకస్మికంగా తనిఖీ చేసి హోం లకు సంబంధించిన భవనాలు, కిచెన్, రూమ్స్, వాటర్ సప్లై, బాత్ రూమ్ లు లేవేట్రి లను పరిశీలించి రిపోర్ట్ లను స్టేట్ లీగల్ సర్వీసు వారికి పంపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పిల్లలకు అందించు ఆహారం, నీరు, నాణ్యతతో వుండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏదేని ఉచిత న్యాయ సలహా సహాయం కోసం మండల న్యాయ సేవల సంస్థ వారిని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డి.సత్యవతి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి. ఎన్ .వి. రంజిత్ కుమార్, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ఏ.అజయ్ కుమార్, హోమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
