పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు తణుకు డిపోలో పరిసర ప్రాంతాలు, అత్తిలి బస్టాండ్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేశామని ఈ 15 రోజులు గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్గో సిబ్బంది, అన్ని యూనియన్ నాయకులు, సూపర్ వైజర్స్, డ్రైవర్ లు, కండక్టర్ లు, స్వీపర్ లు, అత్తిలి బస్సు స్టాండ్ వర్తకులు స్వచ్చందంగా పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేసారని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని తణుకు బస్సు స్టాండ్ గ్యారేజ్ ఆవరణలోను అత్తిలి బస్టాండ్ ప్రాంగణంలో తణుకు మున్సిపల్ కమిషనర్ సహకారంతో మొక్కలు నాటామని
డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ తెలిపారు.
Your Attractive Heading
