మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గల గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఉండ్రాజవరం మండల పరిషత్ అధ్యక్షులు పాలాటి ఎల్లారీశ్వరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో గ్రామాలు స్వచ్ఛభారత్ ప్రారంభించి 10 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీవీఆర్ రామకృష్ణంరాజు, ఏవో శ్రీనివాసరావు, పంచాయతీ విస్తరణ అధికారి జె డి వి ప్రసాద్, మండల వైసీపీ నాయకులు పాలాటి శరత్ బాబు, కార్యాలయ సిబ్బంది నాగనాథ్, మమత, విద్యశ్రీ, అంజిబాబు, కౌసల్య దేవి పాల్గొన్నారు.
