జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి పురస్కరించుకుని తణుకు పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గల మహాత్మా గాంధీ విగ్రహానికి, కోర్టు ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత జాతీయోద్యమంలో స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ సత్యం, అహింస కు మించిన ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి మార్గ నిర్దేశం చేసిన బాపూజీ జయంతిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తించిందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన ఉద్యమాలు ఆయన నాయకత్వంలో జరిగాయని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో జీవితం ఎలా ఉందో తెలిసిన ఎవరైనా మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన పనిని అభినందించకుండా ఉండరని ఈ రోజు మనలో ప్రతి ఒక్కరికి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో మరియు మనం ఎలాంటి జీవితాన్ని గడపాలని ఆకాంక్షించాలో గుర్తు చేయడానికి మరొక రోజు ఇది అని మనమందరం మన జీవితాలను మరింత అర్థవంతంగా జీవించడం ప్రారంభించడానికి మన వంతు ప్రయత్నం చేద్దామని,. మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాబట్టి, మన దేశ ప్రగతి కోసం కష్టపడి పనిచేసేలా యువ తరానికి కూడా స్ఫూర్తినివ్వడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజేపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
