జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ప్రతి పౌరుడు తన బాధ్యతగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు వాకలపూడి సత్యనారాయణ, ఉప సర్పంచ్ జవ్వాది వీరభద్రం, టిడిపి జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
