తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన రబి పంట పై ప్రణాళిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి ఇరిగేషన్ మరియు డ్రైన్స్ అధికారులు అలాగే ప్రాజెక్టు కమిటీ చైర్మన్, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్స్ అలాగే నీటి వినియోగదారుల సంఘం ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, టిసి మెంబర్స్ హాజరవడం జరిగింది. గోదావరిలో నీటిలభ్యత తగ్గుముఖం పడుతున్న కారణంగా ఈ రబి పంటకి వంతులువారి విధానం ప్రభుత్వ ఆదేశానుసారం తేదీ 1.2.25 నుండి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో సుమారు 150 మంది T.C మెంబర్లు ఉన్నారని, వాళ్ళందరూ కొంత సమయం కేటాయించి కాలువలపై సమస్యలు తెలుసుకుని అలాగే వంతులును సమర్థవంతంగా అమలుపరిచే విధంగా అవగాహన ఉండాలని ఆదేశించడం జరిగింది. నీటిసంఘాల పరిధిలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పనులు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు సేకరిందామని తెలియజేసి అన్నారు. మరియు కాలవగొట్లపై ఏ విధమైనటువంటి ఎంకరోచ్మెంట్స్ అనగా ఆక్రమణలు గురికాకూడదనేసి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పియున్నారు. అలాగే రబి పంట కు సంబంధించి కొన్ని గ్రామాల్లో మెరకాయ కట్టుకు లిఫ్టులు పెట్టాలని అలాగే మంచిల్లో ఎలక్ట్రికల్ లైన్ ప్రపోసల్స్ పంపించడం జరిగిందని తెలియజేస్తున్నారు.
అలాగే రవబి పంటలో యూరియా సమస్య తలెత్తకుండా తొలి ఏర్పాట్లు చేసి ఉన్నామని తెలియజేసి ఉన్నారు. విజ్జేశ్వరం హెడ్ నుంచి 4600 కు సెక్స్ వాటర్ ఇస్తే తప్ప రబికి కష్టమవుతుంది కావున హెడ్ నుండి 4600 నుంచి 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను చెప్పియున్నారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మరియు ప్రభుత్వ సిబ్బంది బీసీలు టీసీలు తదితరులు పాల్గొన్నారు.
