భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన సోమవారం పట్టణంలోని 19,32,33,34 వార్డుల నుండి సుమారు 25 మంది బారతీయ జనతా పార్టీ లో చేరారు. జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి ధ్యేయంగా రైతులు,పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలు నచ్చి పార్టీలో అధిక సంఖ్యలో చేరికలు జరుగుతున్నాయన్నారు. రానున్నరోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నాయకత్వంలో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ మాట్లాడుతూ పైడిపర్రు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఇంటి దుర్గా శంకరం భారతీయ జనతా పార్టీలోకి రావడం ఆనందాయకమన్నారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడి ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. కష్టపడి పనిచేసే వారికి భారతీయ జనతాపార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు రూరల్ అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, అత్తిలి మండలం అధ్యక్షులు బాలం మహేష్, ఇరగవరం మండల అధ్యక్షులు కాట్నం పరిపూర్ణ, పట్టణ బిజెపి నాయకులు బుద్దాల రాజ్యలక్ష్మి, రాసాబత్తుల అనుకుమార్, కసిరెడ్డి మణిదీప్, బడేటి సాయిరాం, రేపాక సూర్యరామారావు, మారిశెట్టి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
