తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో కొలువైన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాఘమాసం మంగళవారం షష్టి తిధి సందర్భముగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అనంతరం విశేష అలంకరణ జరిగింది. ఈ సందర్భంగా భారీగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
