బ్యాంకు నుండి వడ్డీ లేని రుణాలు ఆటో కార్మికులకు ఇవ్వాలని సిఐటియు నాయకులు కామనమునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రేలంగి గ్రామంలో ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశం పంది నాగరాజు అధ్యక్షతన నాగబాబు జరిగింది. ఈ సమావేశంలో కామన మును స్వామి మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ ఐదులక్షల మంది రాష్ట్రంలో జీవిస్తున్నారని అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకోవడంలేదని అన్నారు. ఆటో కార్మికులు ఆటోలను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వద్ద అధిక వడ్డీలకు ఆటోలను కొనుగోలు చేస్తూ వాయిదాలు, వడ్డీలు చెల్లించలేక పస్తువులతో కాలం గడుపుతున్నారన్నారు. ఆటోల యొక్క విలువ గతంలో రెండు లక్షలు ఉన్నది, ఇప్పుడు 4 లక్షల వరకు ధర పెరుగుదల, స్పేర్ పార్ట్లు ధరలు పెట్రోలు ధరలు పెరుగుట వలన ఆదాయం లేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. రవాణా రంగంలో ఆటో ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న ఆటో కార్మికులైన ప్రభుత్వము చిన్నచూపు చూస్తుందని అన్నారు. పెరిగిన స్పేర్ పార్ట్స్ ధరలను తగ్గించాలని, ప్రతి కార్మికులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ,ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లించాలని మునిస్వామి డిమాండ్ చేశారు.
