రాజానగరం సమీపంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దండకారణ్య ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదాన్ని పైదాకా చొచ్చుకు వెళ్లకుండా కొంతవరకు అరికట్టగలిగామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం రాజానగరం సమీపంలోని దండకారణ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన అధికారులు, స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాదస్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అభయారణ్యంలో ఆకులు రాలిన చాలకాలం తర్వాత అవి లిట్టర్ గా మారాక మానవ ప్రమేయంతో ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. ప్రమాదం పెద్దది కాకముందే అగ్నిమాపక సిబ్బంది త్వరతగతిన వచ్చి సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. త్వరతగతిన స్పందించడం వల్ల చాలా సంఖ్యలో వృక్షాలు కాలి బూడిదకాకుండా కాపాడ గాలిగామన్నారు. ఈ సందర్భంగా అధికారులు, అగ్ని మాపక సిబ్బంది పనితీరును మంత్రి దుర్గేష్ అభినందించారు. రాష్ట్ర అటవీ సంపాదన కాపాడే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ తరహా అంశంపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన నివారణ చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా కమిటీగా ఏర్పడి ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేలా చైతన్యం కల్పిస్తామన్నారు
