సమస్యలు పై కూటమి నేతలకు వినతులు
జర్నలిస్ట్ లు, వారి కుటుంబ సభ్యులు కోసం ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మార్చి 28 న ఉగాది సంబరాలు నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం ఇక్కడ అక్కయ్య పాలెం జంక్షన్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ కార్య వర్గ సమావేశం నిర్వహించి పలుఅంశాలకు సంబందించి చర్చించారు. ఈ సందర్బంగా జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరోజు ఉదయం ఆల్ఫాహారము నుంచి మద్యాహ్నం విందు వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాంసృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణము నిర్వహించి పంచాంగ పుస్తకాలు అందచేస్తామన్నారు. లక్కీ డీప్ ఏర్పాటు చేసామన్నారు. జర్నలిస్ట్ లకు సంబందించిన పలు సమస్యలు పదకాలు అమలు కోసం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని, జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం గతంలోనే ఇందుకు సంబంధించి హామీలు ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులకు సంబంధించి రూపకల్పన చేసిందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లకు తమ రాష్ట్ర కార్యవర్గం ద్వారా వినతులు అందజేశామన్నారు. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని గంట్ల శ్రీను బాబు కోరారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షులు. పి నారాయణ కార్యదర్శి జి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ గత నెల 20 నుంచి నేటి వరకు సుమారు 650 మంది వర్కింగ్ జర్నలిస్టులు తమ యూనియన్ లలో సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నట్లు చెప్పారు. త్వరలోనే అనకాపల్లి అల్లూరు జిల్లాల సభ్యత్ నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయనున్నట్లు వీరు వివరించారు. రాష్ట్ర కార్యవర్గం ద్వారా సభ్యులు జాబితా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవలేశ్వరం రవికుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. సాంబశివరావు, బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, కార్యదర్శి కె. మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్, కార్యదర్శి కొచ్చెర్ల శ్రీనివాస్, గాజువాక, మధురవాడ, యూనియన్ నేతలు గొడబ రాంబాబు, ఆనంద్, రంగ ధామము, కోశాధికారి సీతా రామ మూర్తి, రాజశేఖర్, నాయుడు గణపతి, బొబ్బర ప్రసాద్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.