పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరెమిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బసవా రామకృష్ణ కేక్ కటింగ్ చేసి, తన జన్మదినం సందర్భంగా 20 మంది తల్లిదండ్రులు లేని పేద విద్యార్థిని విద్యార్థులకు 1000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని బ్యాంకులో జమ చేసి విద్యార్థిని, విద్యార్థులకు పాస్బుక్కులను అందించారు. అదేవిధంగా తణుకు అన్న క్యాంటీన్ యందు ఈరోజు భోజనానికి అయ్యే ఖర్చును బసవ రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా బసవ రామకృష్ణను తణుకు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్లు దొమ్మేటి సుధాకర్, పరిమి వెంకన్నబాబు తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీసీ నాయకురాలు వావిలాల సరళ దేవి, పశ్చిమగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు నాగరాజు, జనసేన పార్టీ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఇరగవరం మండల జనసేన అధ్యక్షులు ఆకెటి కాశి, తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, శ్రీనివాస పండ్ల వర్తక సంఘ సభ్యులు, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభ్యులు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులు, కిల్లి బీడీ వర్తక సంఘ సభ్యులు, పి ఎం పి అసోసియేషన్ సభ్యులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా విచ్చేసి శుభాకాంక్షలు అందజేశారు.
