ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ‘‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జనవరిలో ‘న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్’ నేపథ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ సారి ‘సోర్స్ రీ సోర్స్’ గా కార్యాచరణ చేపట్టారు. జీవనప్రమాణాలు పెంచే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలని, ఘన వ్యర్ధాల నిర్వహణతో పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రధాన కర్తవ్యంగా భావించాలని కోరారు. 14 ఇండికేటర్లతో పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖలు నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధమ స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ జిల్లా ను సీఎం అభినందించారు. మిగిలిన జిల్లాలు కూడా ప్రగతి సాధించాలని కోరారు. నేడు జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీ పొంగూరు నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
