ప్రపంచ మానవాళి సమానత్వం కోసం తన ప్రాణాలను బలి ఇచ్చిన మహనీయులు. ప్రపంచ ప్రఖ్యాత విప్లవ యోధుడు “ఎర్నెస్ట్ చే గువేరా ‘ అందరికీ ఆదర్శప్రాయుడు అని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు అన్నారు చేగువేరా 57వ వర్ధంతి సందర్భంగా జువ్వల రాంబాబు ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ చేగువేరా అంటే ఫ్యాషన్ కి సింబల్ కాదని, మనుషులంతా, ఒక్కటే ఆర్థిక వ్యత్యాసాలు లేని దోపిడీ రహిత సమాజం కోసం పోరాడే విప్లవానికి సంకేతమని అన్నారు. చేగువేరా అర్జెంటీనాకు చెందిన మార్క్సిస్టు మేధావి, డాక్టర్, విప్లవ యోధుడు, రచయిత గెరిల్లా పోరాట పటిమ గల నాయకుడు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆచరణలో పెట్టడానికి యుద్ధంలో ఎంతో కృషి చేశారని క్యూబన్ విప్లవంలో ఫైడల్ కాస్ట్రో తో కలిసి క్యూబన్ విప్లవాన్ని జయప్రదం చేసి ప్రభుత్వంలో పరిశ్రమలమంత్రిగా పనిచేసి క్యూబాలోని కార్మిక కర్షక ఆర్థికస్థితి గతులనే మార్చేసారని. అన్నారు. 1800మంది బొలీవియెన్ సైన్యం ఆయన్ని బంధించి హింసించిగా 1967అక్టోబర్ 9వ తేదీన అమరుడు అయ్యారని ఆ మహనీయుడు కి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీ చిరంజీవి, సురేష్ రాజేష్ కృష్ణ, కొండ భవాని, రాణి పద్మ తదితరులు పాల్గొన్నారు
