టి.పి.గూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం మహిళా అధికారులు ,వీరమహిళలుకు చీర-సారె ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతీఫ్ కౌసర్ భనో, ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి, ఎమ్మార్వో సీతారత్నం . వీరితోపాటు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ…

మహిళలని సత్కరించడం చాలా ఆనందదాయకమని, పురుషుడు ఎదుగుదల ఒక స్త్రీ వల్లే సాధ్యమని, మా కుటుంబం ఒక సాధారణ కుటుంబం నేను ఎక్కడ ఉన్నా… తిన్నావా అని అడిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అమ్మ …ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చిన నాభార్య.

మనకు ఏదైనా దెబ్బ తగిలితే మగవారైనా ఆడవారైనా అమ్మ. అంటాం. నన్ను నా తల్లి ప్రోత్సహించడం వల్లే ఈ స్థాయికి వచ్చానని నా తల్లి ధన్యవాదాలు తర్వాత నా సతీమణి నా జీవితం లోకి వచ్చిన తర్వాత అన్నీ కలిసి వచ్చాయని, మా సతీమణికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదని మగవారికి దీటుగా ఆడవారిని కూడా ఒకేలా చూడాలని, వారు ఏ వృత్తి లోనైనా రాణించగలరని, ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత సాహసవంతురాలో – మగవాడైన చత్రపతి శివాజీ కూడా అంతే సాహసంతులు. అందుకునే స్త్రీ పురుషులు సమానమని ఒకరికి ఒకరు గౌరవించుకుని సమాజంలో కుటుంబంలో మెలగాలని అప్పుడే ఆ కుటుంబం గాని దేశం గాని అభివృద్ధి చెందుతుందని, మరొకసారి వీరందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.. మేము ఈ వృత్తిలో అవినీతికి తావు లేకుండా నిజాయితీ, నిబద్ధతతో రాణించాలని మీ మంచి ఆలోచన విధానాన్ని పెంపొందించుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి, డాక్టర్ సుజాత, కసిరెడ్డి మధులత, వెజ్ విజయలక్ష్మి, గుండుమోగుల. పద్మప్రియ, వీర మహిళలు, బొలిశెట్టి రాజేష్ పుల్లా బాబి. అడపా ప్రసాద్ అడబాల. నారాయణమూర్తి. మైలవరపు రాజేంద్రప్రసాద్. గుండుమోగుల సురేష్. పై బోయిన వెంకటరామయ్య. నలగంజి రాంబాబు మద్దాల మణికుమార్ అడ్డగర్ల సురేష్ . గడ్డం నాని.మద్దాల నరసింహారావు ముఖేష్. పాలూరి సతీష్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link