కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం లభించిందని
త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపిన మంత్రి దుర్గేష్
ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి సూర్యలంక బీచ్ కు నిధులు ఇవ్వమని కోరిన మంత్రి దుర్గేష్
ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించిన పర్యాటక శాఖ: మంత్రి దుర్గేష్
ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నిధులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్
త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వబోతుందని, సూర్యలంక బీచ్ లో మౌలిక వసతుల కల్పన, పరిశుభ్ర బీచ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించిన మంత్రి దుర్గేష్
రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్
రాష్ట్ర పర్యాటక ప్రగతికి కృషి చేస్తున్న టూరిజం సెక్రటరీ అజయ్ జైన్, పర్యాటకశాఖ అధికారులను అభినందించిన మంత్రి దుర్గేష్
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ క్రింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు రూ.172.34 కోట్లు విడుదల
తాజాగా సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు విడుదల
రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేందుకు కృషి చేస్తోన్న మంత్రి కందుల దుర్గేష్
మంత్రి కందుల దుర్గేష్ కృషితో పర్యాటకాంధ్రప్రదేశ్ గా మారనున్న రాష్ట్రం