విశాఖ నగర నూతన మేయర్ పీల్లా శ్రీనివాస్ను మాజీ వి.యం.ఆర్.డి.ఏ. ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల వెంకట్రావు దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి దిశగా మేయర్కి తమ ఆకాంక్షను తెలిపారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ “కొంతమంది యాదవ సంఘ నాయకులు ముసుగులో తెలుగుదేశం పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా YS జగన్మోహన్ రెడ్డికి యాదవులపై ప్రత్యేక అభిమానముంటే ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో యాదవులకు సీట్లు కేటాయించని పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా విశాఖనగరంలో బలమైన వర్గంగా ఉన్న తనని ఒక యాదవ మహిళగా తీవ్ర అవమానంతో సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ఆరోజు జరిగిన అన్యాయంపై అప్పుడు ఎక్కడికి పోయారు అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు అక్రమాని అవినాష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
