ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి కళ్ళాలలో ధాన్యం పరిశీలించిన మండల వ్యవసాయాధికారి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తణుకు మండలములో ఇప్పటివరకు14003 ఎకరాలలో 29,500 మెట్రిక్ టన్నులు ధాన్యము కొనుగోలు జరిగినది, అనగా 95% వరకు ధాన్యము కొనుగోలు జరిగినదని, ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా జరిగాయని చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వచ్చిన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేస్తూ పరిష్కారం చేశామని మండల వ్యవసాయాధికారి కె.కుసుమ తెలియచేసారు. ఇంకా 760 ఎకరాలలో పంటకోతలు జరగాలని, ఎక్కడ కూడా పంటనష్టం లేదని, 1000 MTS వరకు కల్లాములో ఉన్న ధాన్యమును రైతులు ఒబ్బిడి చేసుకోవాలని, ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వెంటనే బయటికి తీసివేయాలని, టార్పాలిన్ లతో ధాన్యమును కప్పుకుని భద్రపరుచుకోవాలి. ధాన్యము మొలకెత్తకుండా 5% ఉప్పు ద్రావణమును అవసరం అయితే పిచికారీ చేయాలి అని మండల వ్యవసాయధికారిని, కె.కుసుమ తణుకు మండలంలోని వివిధ రైతు సేవాకేంద్రాలలోని పొలములను సందర్శించి తెలియచేసారు. గ్రామ వ్యవ్యసాయ సహాయకులు కె.అరుణ్ తేజ, పుష్పలత, అయ్యప్ప, సంపత్ లు పాల్గొన్నారు.
