తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

హాజరుకానున్న రాష్ట్ర మంత్రి అనిత, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు

వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు నియోజకవర్గంలో ఈనెల 13న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు ఇరగవరం అత్తిలి మండలాల పరిధిలో మొత్తం రూ.4.09 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొంటారని చెప్పారు తణుకు పట్టణంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు అనంతరం పాలూరు, అత్తిలి, కేఎస్ గట్టు, వేల్పూరు, కె.ఇల్లింద్రపర్రు గ్రామాల్లో జరుగుతాయని వివరించారు. ఆయా కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link