విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)( సి) ప్రకారం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ యస్ ఏ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం తణుకులో సోమవారం స్థానిక బి.సి. బాలుర వసతిగృహంలో గంటా పవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఎస్సి, ఎస్టి, బిసి, అనాధ పిల్లలు , దివ్యాంగులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని దీనిని తక్షణమే విద్యాశాఖ అధికారులు అమలు చేసేటట్లు చూడాలని వారు డిమాండ్ చేశారు. ( పి.డి.యస్.యు) జిల్లాకార్యదర్శి చిలకా నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని దీనిలో భాగంగా తల్లికి వందనం తక్షణమే ప్రతీ విద్యార్థికి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. (ఏ వి యస్) రాష్ట్ర కమిటి సభ్యులు సి హెచ్ అరవింద్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ మిగులు బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు లేనిచో ఐక్య ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు, సామాజిక న్యాయపోరాట సమితి (ఎస్.ఎన్.పి. యస్) వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళి మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు సమాజంలో కొన్ని వర్గాలు మాత్రమే విద్యను అభ్యసించే వారిని స్వాతంత్రం వచ్చిన అనంతరం భారత రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువుకునే అవకాశం లభించిందని వారు తెలిపారు కానీ ఈరోజు విద్యా వ్యాపారం జోరుగా కొనసాగుతుందని అదే క్రమంలో ప్రభుత్వ విద్యారంగం కనుమరుగవుతుందని దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలేనని వారు తెలిపారు పరోక్షంగా ప్రభుత్వాలు విద్యా ప్రవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయని వారు ధ్వజమెత్తారు, ఆల్ ఇండియా పూలే అంబేడ్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పొట్ల సురేష్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి కడుదయనీయం గా ఉంది అని ఈ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థుల మెస్ , కాస్మోటిక్ చార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు న్యాయవాది కౌరు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 వారీగా పేద , బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25 శాతం సీట్లు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ఉచితంగా ఇవ్వాలని దీని కోసం విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు లాభాలలో సగం వాటా ఇవ్వాలని చట్టం ఉందని దానిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడే అది సాధ్యమవుతుందని వారు విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాల ఐక్యకార్యచరణగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై పోరు చేయాలని వారు పిలుపునిచ్చారు. న్యాయవాది అనుకుల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం రోజురోజుకు నిర్వీర్యం అవుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని ఈ పాఠశాలలను తిరిగి పున ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేటట్లు విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. , న్యాయవాది కోలా దుర్గభవాని మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు పోరాట ఫలితంగా విద్యార్థులకు పలురకాల లబ్ధి చేకూరుతుందని దీనికి విద్యార్థి సంఘాల్ని అందరూ అభినందించాలని వారు అన్నారు. విద్య హక్కు చట్టం అనుసరించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయవాది ధనాల అప్పారావు , యు.మురళీ , పి.వివేక్ తదితరులు పాల్గొన్నారు.
