నాటుసారా తయారీని విడిచిపెట్టిన వారిజీవితాల్లో నవోదయం..

ప్రత్యమ్నాయ ఉపాధికల్పనకు చర్యలు.. – వారంరోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలి..

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

నాటుసారా తయారీ, అమ్మకాలు సంపూర్ణంగా స్వస్తిపలికిన వారికి ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించే చర్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నాటుసారా తయారీని విడిచిపెట్టినవారికి ఉపాధి కార్యక్రమాలు నిర్వహణపై ఎక్సైజ్, వివిధ సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా గుర్తించిన అర్హులైన వారికి ప్రత్యమ్నాయంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా డిఆర్డిఏ, వ్యవసాయ, ఉధ్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, సెట్ వెల్, స్కిల్ డెవలప్ మెంట్, జిల్లా పరిశ్రమల శాఖ, బి.సి. కార్పోరేషన్, తదితర శాఖల అధికారులు ఎక్సైజ్ అధికారులతో చర్చించి వారంలోగా తుది జాబితా తయారుచేసి నాటుసారా తయారీకి స్వస్తిపలికిన కుటుంబాలకు జీవనోపాధి మార్గం చూపించాలని ఆదేశించారు. ఆకుటుంబాల అందరిని సమావేశ పరిచి వారు ఏ ఉపాధిమార్గం ఎంచుకున్నారో జాబితా రూపొందించాలన్నారు. ఆయా పధకాలకు సంబంధించి వారికి రుణాలు ఇప్పించేందుకు ఎల్డిఎమ్ తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు.
నాటుసారా తయారీదారులలో ప్రత్యమ్నాయ జీవనోపాధి కల్పించి మార్పు తీసుకురావాలని నవోదయం-2.0 భాగంగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

సమావేశంలో జిల్లా ఎక్సైజ్ అధికారి ఎ. ఆవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, లైజన్ ఆఫీసర్ షేక్ రమేష్, పలువురు ఎక్సైజ్ సిఐలు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఎల్డిఎమ్ డి. నీలాధ్రి, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link