తణుకు పట్టణంలో బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద పెరుగుతున్న నిత్యవసరాల ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నిత్యవసర వస్తువులు, కూరగాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద తక్కువ ధరలకే నిత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ ప్రయోజనం చేసే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మార్కెట్ రేట్లు సమీక్షించి నిత్యవసర వస్తువులకు ధరలు పెరిగినప్పుడు ధరలు తగ్గించి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా మార్కెట్లో పామాయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉల్లిపాయలు టమోటాలు దిగుబడి తక్కువగా ఉండటం వల్ల ధరలు పెరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలకు రేట్లు అందుబాటులో ఉండడం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. గత ప్రభుత్వహయాంలో ధరల నియంత్రణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు ప్రభుత్వ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
