వైసీపీ హయాంలో ఆదాయ వనరుగా ప్రజా పంపిణీ వ్యవస్థ

ప్రణాళిక బద్ధంగా ఎండియు వాహనాల ద్వారా అక్రమాలు

కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలింపు

అక్రమాలు అరికట్టడానికి తిరిగి రేషన్ షాపులు పునఃప్రారంభం

తణుకు నియోజవర్గంలో 140 షాపులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ప్రజా పంపిణీ వ్యవస్థను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. వేల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టి వాటి ద్వారా అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించే వారని ఆరోపించారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించగా తణుకు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రాధాకృష్ణ రేషన్ డిపోల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని రీసైకిలింగ్ చేసి కాకినాడ పోర్టు ద్వారా బియ్యాన్ని విదేశాలకు తరలించేవారని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కనుసనల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను దోచుకున్నారని ఆరోపించారు. ఎండియు వాహనాల ద్వారా ఏటా రూ. 350 కోట్లు నష్టం వాటిల్లుతుదని చెప్పారు. ఇవన్నీ పరిశీలించిన కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను గతంలో మాదిరిగానే నేరుగా రేషన్ షాపుల ద్వారా అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 140 రేషన్ షాపులను పునః ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రతినెల 15 రోజులపాటు నరాటంకంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు వీలైన సమయంలో సులభతరంగా రేషన్ సకలు తీసుకునే విధంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి వారి ఇంటికే రేషన్ సరుకులు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమాన్ని అందించేలా సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో పరిపాలన సాగుతోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, తాసిల్దార్ వర్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link