ఆదివారం తణుకు పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం నందు జూన్ 4వ తేదీన జరిగే “వెన్ను పోటు దినం” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలుచేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందని, ప్రజలకు తెలియచెప్పేందుకే వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు.
