నిడదవోలు పురపాలక సంఘంలో జనసేన పాగా

వైస్ ఛైర్మన్ గా వజీర్ ఎంపిక కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

• రాష్ట్రంలో జనసేన పార్టీ కైవసం చేసుకున్న ఏకైక మున్సిపాలిటీ నిడదవోలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి

• ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కూటమి విజయంలో జనసేనది కీలకపాత్ర అని పేర్కొన్న మంత్రి దుర్గేష్

• జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా నిర్వహిస్తోన్న పండుగలో రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా నిడదవోలు మున్సిపాలిటీ విజయం అందిస్తామన్న మంత్రి దుర్గేష్

• జనసేన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్

• పురపాలక విజయంతో భారీ ఎత్తున జనసేన పార్టీ శ్రేణుల సంబురాలు.. జై కందుల దుర్గేష్, జై జనసేన, జై కూటమి అంటూ నినాదాలు..

Scroll to Top
Share via
Copy link