4వ అదనపు జిల్లా కోర్టు తణుకు. రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు చైర్మన్ మరియు జిల్లా జడ్జి ఏలూరు వారి ఆదేశముల మేరకు చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి ఒక పత్రికా ప్రకటనలో ఈ విదంగా తెలిపారు. ఉమ్మడి జిల్లాలలో కోర్టులు ఉన్న ప్రతిచోటా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దానిలో రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ బకాయి కేసులు, ఎం.వి.ఓపి. ఆక్సిడెంట్ కేసులు, కుటుంబసభ్యులతో తగాదాకేసులు అనగా ఎం.సి. మైంటెనెన్స్, డి.వి.సి. గృహహింస కేసులు, సివిల్ కేసులు, ప్రామిసరి నోట్ బకాయికేసులు, ప్రిలిటిగేషన్ కేసులుగా టెలిఫోన్ బకాయికేసులు, బ్యాంక్ బకాయికేసులు రాజీచేసుకోవచ్చని, రాజీయే రాజామార్గమని, కేసులు జాతీయ లోక్ అదాలత్ లో రాజీచేసుకొనుట వల్ల విలువైన సమయము, డబ్బు ఆదా అవుతుంది అని చెప్పారు. ప్రతి రోజూ కోర్టులలో ప్రిలోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారని దానిలో కూడా కేసులు రాజీచేసుకుని అవార్డు పొందవచ్చని, భార్యభర్తల కేసులలో ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భార్యభర్తలకు కౌన్సెలింగ్ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి, ఏలూరు వారు నిర్వహిస్తున్నారని దానిలో కూడా కేసులు రాజీచేసుకోవచ్చని, చిన్న చిన్న తగాదాలను రాజీ చేసుకుని గ్రామాలలో ప్రశాంతంగా జీవించాలని, జాతీయ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు రాజీ చేసుకొనుటవల్ల కోర్టుకు కట్టిన కోర్టు ఫీస్ తిరిగి తీసుకునే అవకాశం ఉందని ఈ అవకాశం కోర్టులలో కేసులు వున్నవారు, సద్వినియోగం చేసుకోవాలని అలాగే జాతీయ లోక్ అదాలత్ ల గురించి తెలియని వారికి తెలియ చెప్పాలని కోరారు. సమాచారము కోసం పోలీసు సిబ్బందిని, న్యాయవాదులను కోర్టు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
