గురువారం తణుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3వ వార్డ్ కొమ్మాయి చెర్వుగట్టు వద్ద తణుకుశాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, తణుకు మునిసిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్ “దోమలార్వాలను తినే గంబుసియా చేపపిల్లలను” నీటిచెరువులు, నీటి కొలనులలో విడుదల చేసారు. ఈ సందర్భంలో శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ “గంబూసియా చేపలు దోమ లార్వాలను తినడం ద్వారా దోమ పుట్టుకు చెక్ పెడతాయని, ప్రతిఒక్కరూ ఇండ్లఆవరణలో, పరిసరాలలో చిన్న చిన్న నీటి నిల్వలు లేకుండా డ్రై గా ఉండేటట్లు చూడాలని” అన్నారు. మునిసిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్ మాట్లాడుతూ “తణుకు వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ సబ్ యూనిట్ సప్లై చేసిన మొత్తం గంబూసియా చేపపిల్లలను తణుకు పట్టణంలో ఎంపిక చేసిన 11పాయింట్లలో వీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు, ఫైలేరియా యూనిట్ సూపర్వైజర్ కె. సత్యన్నారాయణ,హెల్త్ అసిస్టెంట్ ఎన్.తాతాజీ, వార్డ్ హెల్త్ సెక్రెటరీలు కె.మార్థమ్మ, వై.సునీత, జె. శాంతకుమారి, కె.బేబీకుమారి పాల్గొన్నారు.
