పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం ఏడీసీఎల్ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి కందుల దుర్గేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్

ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్

పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

అనంతరం వృక్ష సంరక్షణ కోసం సీఎం, డిప్యూటీ సీఎం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి వనమహోత్సవ ప్రతిజ్ఞ చేసిన గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి దుర్గేష్

Scroll to Top
Share via
Copy link