యోగాను నిత్యజీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

యోగా వల్ల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి

ఈనెల 21న విశాఖలో ఐదు లక్షల మందితో యోగా

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

తణుకులో వేలాది మందితో యోగాంధ్ర- 2025

యోగాను నిత్యజీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. యోగాంధ్ర- 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన యోగాసనాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 14 వేల గ్రామాల్లో యోగాను ప్రజలకు అలవాటు చేసి రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నంలో 5 లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. యోగాను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయంగా గుర్తించిన అనంతరం 2015లో అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఐదు లక్షల మందితో యోగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసే విధంగా ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను నిత్యజీవితంలో భాగస్వామిని చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి నెల రోజులుగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని యోగాను భాగస్వామ్యం చేసేలా ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు యోగాంధ్ర- 2025 వెబ్ టు ద్వారా రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని గుర్తు చేశారు. యోగాను ప్రతి ఒక్కరిలో అంతర్భాగం చేసే విధంగా కృషి చేస్తుందని చెప్పారు. ప్రతిరోజు కేవలం 45 నిమిషాలు యోగ చేయడం ద్వారా ఆ రోజంతా ఉత్తేజంగా ఉండగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link