ఇంట్లో మహిళల జోలికి వస్తే ఖబడ్దార్ కారుమూరి
‘కె టాక్స్’ పేరుతో ప్రజలను దోచుకున్న కారుమూరి
కారుమూరి పాపపు పనులు తమపై రుద్దుతున్నాడు
కారుమూరి చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసు
మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ధ్వజం
తనపైనా, తన కుటుంబంపైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు వాటిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి తృణప్రాయంగా వదులకుని రాజీనామా చేస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సవాల్ విసిరారు. ఇంట్లో మహిళల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే బ్రష్టు పట్టుకుపోతావని హెచ్చరించారు. రాజకీయంగా పోరాడా… రాజకీయంగా నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపాం… రాజకీయంగా చేసిన అక్రమాలు వెలికి తీశాం… అంతే తప్ప తాను ఏనాడూ వ్యక్తిగతంగా దూషించలేదన్నారు. అయితే ఇప్పుడు ఇంతలా దిగజారి ఇంట్లో మహిళలను విమర్శించే స్థాయికి వచ్చాంటే నీ మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని మాజీ మంత్రి కారుమూరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం తణుకులోని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. వెన్నుపోటు పేరుతో తణుకులో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి ఎంతమందిని వెన్నుపోటు పొడిస్తే ఈ స్థాయికి వచ్చారో నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి కబర్లు చెబితే హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబును ముసలోడు అని విమర్శిస్తున్న కారుమూరి కనీసం ఎండలో పది నిమిషాలు మాట్లాడగలవా అని ప్రశ్నించారు. అదే చంద్రబాబునాయుడు రెండు గంటలు నిలబడి మాట్లాడగలిదే సత్తా ఉందన్నారు. చంద్రబాబుతో పోటీ పడే దమ్ము, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో కె టాక్స్ పేరుతో దోచుకుని, ప్రజలను వెన్నుపోటు పొడిచి, టీడీఆర్ బాండ్లుతో దోచుకుని, చెక్కులు వద్దు నగదు రూపంలో కావాలని నియోజవకవర్గ ప్రజలను దోచుకున్నావని ధ్వజమెత్తారు. కొందరు వైసీపీ నాయకులు సైతం తమ పార్టీ నాయకులతో సోదరభావంతో ఉంటూ గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కారుమూరి పొడిచిన వెన్నుపోట్లుకు ఎంతో మంది నాయకులు పక్కకు వెళ్లిపోయారని చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో కారుమూరి చేసిన వికృత చేష్టలు ప్రజలకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కార్చుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. గతంలో నువ్వు, నీ అనుచరులు చేసిన వ్యభిచార కార్యకలాపాలు, గంజాయి స్మగ్లింగ్ అందరికీ తెలుసన్నారు. అప్పట్లో కారుమూరి చేసిన పాపపు పనులు తమపై రుద్దాలని చూస్తే కబడ్ధార్ అని హెచ్చరించారు. వ్యక్తిగతంగా తనపై కారుమూరి ఒళ్లుబలుపుతో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు. నీచుట్టూ క్లబ్బులు నడిపేవాళ్లు, బెట్టింగులు నడిపించేవాళ్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. అసందర్భపూరిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఇంకా కసితో పని చేస్తామని అన్నారు. గతంలో తనపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారని వాటిని ప్రజలు నమ్మలేదు కాబట్టే తనకు 72వేల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు.
అక్రమాలు ప్రజలకు తెలుసు…
మాజీ మంత్రి కారుమూరి చేసిన, చేస్తున్న అక్రమాలు నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. అక్రమ మైనింగ్, బాల్కే అక్రమ మైనింగ్ ఎవరి పేరుతో ఉంది… గ్రానైట్ మైనింగ్ ఎవరు కొల్లకొట్టారు…. బియ్యం డబ్బులు ఎక్కడ కొల్లగొట్టావు… సౌత్ ఆఫ్రికా, దుబాయిల్లో పెట్టుబడులు ఎలా పెడుతున్నావు… నీ స్థాయి ఏంటీ… నువ్వు ఇన్ని రూ. వేల కోట్లు ఎలా సంపాందించావో… నీకున్న ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో అన్నీ తేలుస్తానని చెప్పారు. నువ్వు రాజకీయంల్లోకి వచ్చిన నాటి నుంచి ఎంత మంది పీఏలను మార్చావు… ఎంత మంది సిబ్బందిని మార్చివో ప్రజలకు తెలుసు అన్నారు. ప్రతిపక్ష నేతగా హుందాగా మాట్లాడు… çహుందాగా సూచనలు చేయ్… అంతేకానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఎన్ని జంతువులను బలి ఇచ్చావో ప్రజలకు తెలుసు అన్నారు. ఏ విషయంపైన అయినా బహిరంగంగా చర్చిద్దామని సవాల్ విసిరారు.
హాస్యాస్పదంగా ‘వెన్నుపోటు దినం’…
వైసీపీ నాయకులు చేసిన వెన్నుపోటు గాయాలు ఇంకా రాష్ట్ర ప్రజలకు మానిపోలేదని అలాంటి నాయకులు వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం హాస్యాస్పందంగ ఉందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. అయిదేళ్లు పాటు కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర సంపదకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు ఇంకా ప్రజలకు మానని గాయాలుగానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు చేసిన మద్యం కుంభకోణంపై వస్తున్న నిజాలపై దృష్టి మరల్చడానికి జగన్ ఆడుతున్న నాటకమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే సింగిల్ ఫేజ్ మేనిఫెస్టోలో కనీసం పది శాతం కూడా అమలు చేయని పరిస్థితి ఉందన్నారు. మద్యనిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్రెడ్డి నాణ్యత లేని మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి అయిదేళ్లలో 70 శాతం కూడా హామీలు అమలు చేయని అసమర్థ నాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.