ఉండ్రాజవరం మండలంలో వెలగదుర్రు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్) ను నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వేలన్స్ టీమ్ గురువారం పరిశీలించినట్లు ఉండ్రాజవరం పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ ఉషాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా ప్రజలకు అందించే సేవలు, వాటి విధానం, సేవలు అందించే విధానం లో పాటించే పద్ధతులు, నియమాలు, రికార్డులు నిర్వహించే పద్ధతి, సిబ్బంది నైపుణ్యాలను అంచనా వేయుట తదితర అంశాలు ఏన్కాస్ సభ్యులు పరిశీలించినట్లు చెప్పారు. డా. ఎలాంగో, డా.పంకజం లు అసెస్మెంట్ టీం మెంబెర్స్ గా రాగా, వీరికి సహాయకులుగా డా. వ.నవీన, డా. సుధ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి లు ఎల్.కనకదుర్గ, బి.ప్రశాంతి, ఏ. సంధ్యాలక్ష్మీ, డి.విజయలక్ష్మి, కె.బ్యూలా జాయ్, కె.రోజా, ఏ ఎన్ ఎం, పుష్పకుమారి, సచివాలయ ఏ ఎన్ ఎం, బి.కుమారి పాల్గొన్నారు.
