తణుకు నియోజకవర్గం అంబేద్కర్ భవనములో బుధవారం దళితఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తణుకు నియోజవర్గం దళిత ఐక్యవేదిక కన్వీనర్ గా పెనుమాల రాజేష్ కుమార్ ని న్యాయవాది పొట్ల సురేష్ నియమించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఇరగవరం, అత్తిలి మండలాల నాయకులు పాల్గొనగా తణుకు నియోజవర్గ కమిటీ, మండల కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మధు, న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, కొండే నాగేశ్వరావు, వెంకట్రావు, ఎలమంచిలి బాలు, కాకి రాముడు, నక్క రమేష్, కోటి సుధీర్, పడాల బాలు, జంగం ఆనంద్ కుమార్, బాబి గౌరవ అధ్యక్షులు మట్ట జంబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ దళితులపై దాడులు రొజు రొజుకీ పెరుగుతున్న నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలో అందరూ ఏకం కావాలని రానున్న రోజుల్లో దళిత ఐక్యవేదిక మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి దళితుల మీద జరిగే దాడులు ఎదుర్కొనే విధంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
