నిరసనకు సంబంధించిన పోస్టర్ విడుదల…
జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపు
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వేణు, జక్కంపూడి రాజా
రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతుందని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ,మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు విద్యుత్ చార్జీలు పెంపుపై వైఎస్సార్ సీపీ పోరుబాట పోస్టర్లను గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో నందు పార్టీ శ్రేణుల సమక్షం లో వైసీపీ జిల్లా అధ్యక్షులు వేణు, జక్కంపూడి రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారని అధికారం లోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేల కోట్లకు పైగా భారాన్ని మోపారన్నారు.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాలలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని కూటమి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలు తెలియ జేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను దగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాజానగరం నియోజక వర్గంలో 27వ తేదీన చేపట్టే నిరసన కార్యక్రమం రాజానగరం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో నిరసన ర్యాలీగా బయలు దేరి విద్యుత్ ఆఫీసులో ఉన్న అధికారు లకు వినతి పత్రాన్ని అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి,మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిల రెడ్డి,నందేపు శ్రీనివాస్,ఆడపా అనిల్, ఇసుకపల్లి శ్రీనివాస్
మేడబోయిన సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.