ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పై కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆదేశానుసారం, మాజీ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో జరిగిన “విద్యుత్ ఛార్జీలు పై పోరుబాట” కార్యక్రమంలో తణుకు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో నరేంద్ర సెంటర్ నుండి వేల్పూర్ రోడ్ లో ఉన్న విద్యుత్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలపై కరెంటు చార్జీల బాదుడిపై వైఎస్ఆర్సిపి బోరుబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ప్లకార్డులు చేతపట్టుకుని పట్టణంలో భారీ జనసంద్రం నడుమ ర్యాలీ గా బయలుదేరి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి కరెంటు చార్జీలతో ప్రజలకు చుక్కలు చూపుతున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన రూ.15,485 కోట్ల చార్జీల బాదుడును వెనక్కు తీసుకోవాలని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ విధంగా చార్జీల పెంపును నిలిపివేయాలని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
