తణుకు పట్టణంలో స్థానిక జడ్పీ బాలుర హైస్కూల్ నందు బాలోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలో ఈ బాలోత్సవం కార్యక్రమం రెండవసారి ప్రారంభించడం చాలా ఆనందమన్నారు. నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా ఒకే వేదిక పైకి తీసుకొని వచ్చి వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా గర్వకారణము అన్నారు. ముఖ్యంగా ఈ బాలోత్సవం కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రతిభ సంబంధించినటువంటి కార్యక్రమములు అంతేకాకుండా వివిధ కేటగిరీలలో నిర్వహిస్తూ సుమారు 2600 మంది స్టూడెంట్స్ పాల్గొనడం అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒకే చోట నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. అది కూడా మన తణుకు పట్టణంలో జిల్లాపరిషత్ హైస్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ అభివృద్ధి అయ్యే దశలో పిల్లల పేరున ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుందని సెల్ ఫోన్లు గాని మాధ్యమాల్లో ఐటి ద్వారా టెక్నాలజీ ద్వారా వారిపై ప్రభావితం చూపేటట్లు పరిస్థితులు చూపేటటువంటిది చాలా ఎక్కువగా ఉందన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి ఇటువంటి బాలోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఒక చైతన్యం తీసుకువచ్చేవిధంగా కేవలం టెక్నాలజీ కాదు ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెరిగే విధంగా వారిలో ఉన్నటువంటి ఆలోచన భావన మారే విధముగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఈరోజు టెక్నాలజీ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యావ్యవస్థలు కూడా మార్పుచెందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టుతున్నారని ఏడవ తరగతి నుంచి 8వ తరగతి వరకు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ఏ క్లాసులకు ఇంటర్వ్యూ చేసే విధంగా టెక్నాలజీ మార్పులు ద్వారా ఎడ్యుకేషన్ సిస్టం మార్పులు తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబోయేరోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశ భవిష్యత్తు మారే విధంగా ముందుకు వెళ్తారని అందులో సందేహమే లేదని విధ్యార్ధినీ, విద్యార్ధులు, ఉపాధ్యాయులు కూడా సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యని పిల్లలకు చేరువు చేసే విధంగా కేవలం పాఠ్యాంశాలలోనే కాకుండా పిల్లల్ని చైతన్యవంతులు చేసేవిధంగా ప్రతి ఉపాధ్యాయునిపై బాధ్యత ఉన్నదన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు చర్యలు కూడా రాబోయేరోజుల్లో ప్రభుత్వరంగ విద్యావ్యవస్థ, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు. ఈ బాలోత్సవం కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుట్స్ ఎమ్మెల్సీ శ్రీ ఇళ్ల వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టీ జే కుమార్, సిఐటియు పశ్చిమగోదావరి జిల్లా పి వి ప్రతాప్, తణుకు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీమతి పద్మావతి, ప్రైవేటు విద్యాసంస్థల చైర్మన్సు, బాలోత్సవ కమిటీ సభ్యులు తదితరులు, మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.
