నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మహమ్మద్ సిరాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ క్షయ రోగులందరూ క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు,
రీచ్ ప్రాజెక్టు సంస్థవారు టీబీ పేషెంట్లను బరువు తక్కువగా ఉన్నవారిని దత్తత తీసుకొని వారికి పోషకాహార కిట్స్ అందజేయడం అభినందనీయం అని వైద్యాధికారి అన్నారు. టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు మందులు వాడుతున్న వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పోషకాహార నిమిత్తం ప్రతినెల వెయ్యి రూపాయలు డి బి టి ద్వారా అందజేస్తున్నట్టు తెలిపారు, క్షయ రోగులకు సహాయం అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు, ఈ కార్యక్రమంలో రీచ్ ప్రాజెక్టు డిస్టిక్ కోఆర్డినేటర్ వర్మ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్. కే గంగ భవాని, హెచ్ ఓ ప్రసాద్, ఆరోగ్య సహాయకులు జి వి వి ప్రసాద్, సుబ్బారావు, ఎంఎల్ హెచ్పి శ్యామ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
