అధిక అశీలు వసూలు, బినామీ పేర్లతో పలు షాపులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెలిపిన చిరు వ్యాపారులు
నిబంధనలు విరుద్ధంగా వసూలుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ
దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని పూర్ణా మార్కెట్ లో ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారస్తులు పార్టీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పూర్ణా మార్కెట్లో 30 సంవత్సరాలుగా 120 మంది చిరు వ్యాపారస్తులు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని వీటిని పూర్తిగా తొలగించారానీ ఎమ్మెల్యే వంశీ కి తెలియపరచారు. రోజుకి 200 నుంచి 300 అద్దె వసూలు చేస్తున్నట్లు, జివిఎంసికి మాత్రం 20 రూపాయల అశీలు వసూలు చెల్లిస్తున్నట్లు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది దళారీల చేతిలో అనేక షాపులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కొందరి చేతుల్లో అనేక దుకాణాలు వునట్లు, అద్దెలు వసూలు చేస్తున్నారని తెలియపరిచారు . అనేకమంది బినామీలు పేర్లతో దౌర్జన్యంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కి తెలిపారు. పూర్వపరాలు పరిశీలించి ప్రతి ఒకరికి న్యాయం జరిగేలాగా చూస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. బినామీ పేర్లతో వసూలు చేస్తున్న వారికి, ఆశీలు అధికంగా వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.