గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుందర్ కి మద్దతుగా దళిత ఐక్యవేదిక తణుకు నియోజకవర్గ పశ్చిమగోదావరి జిల్లా తరఫున తణుకు పట్టణంలో విస్తృతంగా ప్రచారం జరిగింది చేయడం జరిగింది. బార్ అసోసియేషన్ సభ్యులను ఉపాధ్యాయులను లెక్చరర్లను ఇంజనీర్స్ ను వ్యక్తిగతంగా కలిసి సుందర్ కి తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును ఇవ్వవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. పట్టబద్రుల యొక్క స్పందన చాలా సంతోషకరంగా ఉంది రాబోయే ఎన్నికల్లో సుందర్ అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు అనే విషయం అర్థమైంది అని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, తణుకు నియోజవర్గం దళిత ఐక్యవేదిక అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ నాయకులు గంజి మధు, ఐక్యవేదిక న్యాయసలహాదారు గొల్లపల్లి అంబేద్కర్, బార్ సెక్రెటరీ ఇదా రామకృష్ణ, ఏలూరు చిట్టి మోషే, జంగం వెంకటేశ్వరరావు, జీడిగుంట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
