తణుకు రోటరీ క్లబ్బులో నిర్వహించిన నెలవారి సమావేశంలో హైదరాబాద్, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కే.ఎన్.జి. శ్రీనివాసరావుని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఇప్పటివరకు తణుకు మండలం మరియు పరిసర మానవ శాఖలకు 7 కంప్యూటర్లను వివిధ కంపెనీల ద్వారా అందజేశానని, మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని సోషల్ మీడియాలో మానవతా సంస్థ చేస్తున్న సేవలను చూసి ఆకర్షితుడినినై ఈ సంస్థకు తన సహకారం అందిస్తున్నానని భవిష్యత్తులో మరిన్ని కంప్యూటర్లు ఇస్తామని అన్నారు.
ఇదే సమావేశంలో ప్రతిభా పురస్కారాల్లో భాగంగా qualcomm కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జి. రూపేష్ మరియు అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వారి సతీమణి అనూషకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు మరియు రూపేష్ తల్లిదండ్రులు జగన్మోహన్రావు, గౌరీ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా శాంతిర్యాలీ కమిటీ చైర్మన్ గమిని రాంబాబు మాట్లాడుతూ వివిధ కంపెనీలు స్పాన్సర్ చేసిన కంప్యూటర్లను వివిధ మండలాలకు అందజేస్తున్న కే.ఎన్.జి. శ్రీనివాసరావు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
VIT , IIT లలో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలు అధిరోహించిన నవ దంపతులకు పురస్కారం అందజేయడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో ఉన్నతశిఖరాలు అధిరోహించాలన్నారు. స్టేట్ కన్వీనర్, విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ, ఆంధ్ర ప్రదేశ్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ తణుకు శాఖ చేస్తున్న సేవలు అభినందనీయమని, కంప్యూటర్లు పలుమండలాలకి అందజేసిన శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు చేతులమీదుగా అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద మహిళకు తణుకు మానవతా సంస్థ 5000 రూపాయలు, ఒబిలిశెట్టి మురళి హరినాథ్ 1000 వెయ్యి రూపాయలు మొత్తం 6000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తణుకు శాఖ ఉపాధ్యక్షులు కడంచెర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో తణుకు మండలం కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీవిశ్వనాథం, కన్వీనర్ ఆనందం మస్తాన్రావు, పూలమాల వీరభద్రం, ఒబిలి శెట్టి మురళీ హరినాధ్ ఆకుల శేషుబాబు, ఆకుల వెంకటేశ్వరరావు, దాట్ల సత్యనారాయణ రాజు, ఆకుల జ్యోతి, ఆశాజ్యోతి, అక్కిన లక్ష్మీనరసమ్మ, వి. పార్వతి, గణేష్ మానవత సభ్యులు పాల్గొన్నారు.
