కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన

విశాఖపట్నం:ఫిబ్రవరి 24 (కోస్టల్ న్యూస్)

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు గెలిపించాలని అభ్యర్థన

గవర్నమెంట్ హై స్కూల్ రైల్వే క్వార్టర్స్ మరియు రైల్వే న్యూకాలనీ కెఎన్ మ్ స్కూల్ లలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసారు. ఈనెల 27వ తారీఖున జరగనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా జనసేన పార్టీ సౌత్ సమాన్వయక కర్త శివప్రసాదరెడ్డి మరియు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త సీతంరాజు సుధాకర్ ఈ సమావేశం లో పాల్గొని ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి, సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ విద్యావేత్తలు కూటమి ప్రభుత్వంతో ఉన్నారని భవిష్యత్తులో కూడా కలిసి నడుస్తారని కోరుకుంటూ వారిని రఘువర్మ ని గెలిపించాలని అన్నారు. జనసేన నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర కార్యదర్శి చీకటి రమేష్ టీచర్లకు ఓటు ఎలా వినియోగించుకోవాలో క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐయితి మధు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొల్లూరి రూప, జనసేన వార్డ్ అధ్యక్షులు తెలుగు అర్జున్, టిడిపి అధ్యక్షులు కన్నం రమణారావు, బీజేపీ వార్డ్ అధ్యక్షులు వీరభద్రరావు, గురుగోవిందసింగ్, జనసేన నాయకులు మర్రివేముల శ్రీనివాస్, టీడీపీ నాయకులు జగదీశ్ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link