కబ్జా భూమిని తొలగించేందుకు వెళ్లిన ప్రభుత్వ అధికారులు, విలేకరులపై దాడి

విశాఖ:పెందుర్తి:ఫిబ్రవరి 24 (కోస్టల్ న్యూస్)

భూ కబ్జాదారుడిపై విలేకరులు పెందుర్తి ఎమ్మార్వోకి ఫిర్యాదు.

కబ్జాదారులపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ప్రెస్ క్లబ్ విలేకరుల ఫిర్యాదు

ప్రభుత్వ భూముల్లో భూ కబ్జాలకు పాల్పడుతు అక్రమ నిర్మాణాలు కట్టిస్తున్న పెందుర్తి నియోజకవర్గం, వేపగుంట విలేజ్ బంటాకాలనీ దరి అప్పలనరసయ్యకాలనీలో సర్వె నెం. 75 ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగానికి, మరియు పెందుర్తి మండల తాసిల్దార్ కార్యాలయం వీఆర్వోకి ఫిర్యాదు అందడంతో తొలగించడానికి వెళ్లారు. తొలగించడానికి వెళ్లిన ప్రభుత్వ అధికారులపైన, కవరేజ్ చేయడానికి వెళ్లిన స్థానిక విలేకరులపై దాడిచేసి, దుర్భాసలాడిన విషయంపై పెందుర్తి ప్రెస్ క్లబ్ సభ్యులు పెందుర్తి మండల తాసిల్దార్ కు, పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో ప్రభుత్వ భూములను కబ్జా చెసిన వ్యక్తులపైన మరియు దాడి చేసిన వ్యక్తులపైన తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాసిల్దార్నీ, పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు, విశాఖ జిల్లా జాప్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాసరావు, గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకు పనిచేసిన విలేకరులున్నారు.

Scroll to Top
Share via
Copy link