ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారంను “స్వచ్ఛ ఆంధ్ర” దినోత్సవంగా ప్రకటించి ప్రతి నెల ఒక్కొక్క జిల్లాను ఎంపిక చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
దీనిలో భాగంగా మార్చి 15న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రతను పెంపొందించేందుకు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” ప్రోగ్రాం కోసం కార్యాచరణ మార్గదర్శకాలు విడుదల చేసి ప్రతినెల నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర సూచికల ఆధారంగా పారిశుద్ధ్య చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని బహుళ శాఖల సమన్వయంతో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించదం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, అటవీ, పర్యావరణ, విద్యా, ఆరోగ్య, రవాణా, సంక్షేమ శాఖలు సహా కీలక ప్రభుత్వ విభాగాలు భాగస్వాములుగా చేపట్టడం జరిగిందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం కింద పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్ళు, అంగన్వాడీలు, మార్కెట్లు, రైలు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుచున్నదన్నారు. ఇందులో భాగంగా జిల్లాల నోడల్ అధికారిగా సిపిఓ వ్యవహరిస్తారన్నారు. ఈ నెల స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి” అనే థీమ్తో నిర్వహించడం జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.